byసూర్య | Fri, Aug 23, 2019, 03:40 PM
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని షెల్ సెలెక్ట్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం జరిగింది. బంక్ను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్న క్రమంలో బంకులో టెక్నిషన్ సిబ్బంది పైపు లైన్లను, మెషీన్లను పరిశీలిస్తున్న క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న నాచారం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గాయపడిన వారిని ఈసీఐఎల్లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.