byసూర్య | Fri, Aug 23, 2019, 02:57 PM
తాగిన మత్తులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి గ్రామానికి చెందిన మామిడిల ప్రశాంత్( 27) అనే యువకుడు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాగిన మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు