బిస్కెట్లు ఇప్పిస్తానని.. చిన్నారి కిడ్నాప్

byసూర్య | Fri, Aug 23, 2019, 02:18 PM

శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌లో మూడేళ్ల చిన్నారి అపహరణకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రావణ్‌ దంపతులు గగన్‌పహాడ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.. చిన్న కుమార్తె మూడేళ్ల శ్రద్ధ ఇంటిముందు ఆడుకుంటూ గురువారం సాయంత్రం కనిపించకుండా పోయింది. పరిసర ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ ఆగంతకుడు పాపను తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM