byసూర్య | Fri, Aug 23, 2019, 12:58 PM
వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. దుబ్బాక మండలం పోతరెడ్డిపేటలో మంగి కవిత (24) అనే వివాహిత తన తల్లి గారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కవిత బలవన్మరణానికి కారణం అత్తగారి ఇంటివద్ద వరకట్న వేధింపులేనని ఆమె బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.