భర్తపై దాడి చేసి.. భార్యను ఎత్తుకెళ్లిన వైనం

byసూర్య | Thu, Aug 22, 2019, 06:44 PM

హైదరాబాద్ లోని అంబర్‌పేట పటేల్‌నగర్‌లో దారుణం జరిగింది. నవదంపతులపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు. దాదాపుగా 15 మంది అగంతకులు ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేశారు. నెలరోజుల క్రితమే రాజు, బిందు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భార్య కిడ్నాప్‌పై రాజు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అయితే ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని అంబర్‌పేట పోలీసులు సూచించారు. భార్య బంధువులే కిరాయి రౌడీలతో కిడ్నాప్‌ చేయించి ఉంటారని భర్త వాపోయాడు.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM