కేరళ అసెంబ్లీని సందర్శించిన స్పీకర్ పోచారం

byసూర్య | Thu, Aug 22, 2019, 05:51 PM

తిరువనంతపురం: తెలంగాణ అసెంబ్లీ సభాధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కేరళ అసెంబ్లీని సందర్శించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం కేరళ రాజధాని వెళ్లిన స్పీకర్.. తన పని ముగించుకున్న అనంతరం కేరళ అసెంబ్లీకి వెళ్లారు. స్థానిక అసెంబ్లీ స్పీకర్ పి. రామకృష్ణన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వారిరువురూ అసెంబ్లీ అంతా తిరిగి పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, ఇతర అంశాలపై వారి చర్చ కొనసాగింది. కాగా, కేరళ గవర్నమెంట్ తరఫున శ్రీరామకృష్ణన్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జ్ఞాపిక, పుస్తకాలను బహూకరించారు. కార్యక్రమంలో కేరళ అసెంబ్లీ స్పీకర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM