byసూర్య | Thu, Aug 22, 2019, 05:42 PM
మాజీ కేంద్రమంత్రి చిదంబరం కస్టడీ పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. చిదంబరంను రోజుల కస్టడీకి పంపించాలని సిబిఐ కోరగా కోర్టు చిదంబరానికి మాట్లాడే అవకాశమిచ్చింది. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన చిదంబరం లంచం తీసుకున్నారన్న దానిలో వాస్తవం లేదని వెల్లడించారు. ముప్పై నిముషాలు తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కాసేపటిలో తీర్పును వెల్లడించనుంది.