byసూర్య | Wed, Aug 21, 2019, 06:54 PM
అందమైన లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ప్రాంతానికి చెందిన ముస్కు సుదర్శన్, ప్రమీల దంపతులు పొచ్చెర జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా వారిని వెంటాడుతున్న కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.