byసూర్య | Wed, Aug 21, 2019, 06:37 PM
సిద్ధిపేట: అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కెసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. కోమటిబండలో కలెక్టర్లతో కెసిఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం పంచాయతీ రాజ్, మున్సిపల్, రెవెన్యూ చట్టాల అమలుపై చర్చ జరగగా వర్షాలు పుష్కలంగా కురిసేందుకు, జీవవైవిధ్యానికి అడవులు దోహదపడతాయని, రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గజ్వేల్ నియోజకవర్గంలో భూములు చెట్లు లేని ఎడారుల్లా మారాయని, పునరుద్ధరణ పనులు మూడేళ్ల క్రితమే మొదలుపెట్టగా ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. గజ్వేల్ కృత్రిమ అడవులను స్ఫూర్తిగా తీసుకొని అడవుల పునరుద్ధరణ, రక్షణ చేపట్టాలన్నారు. అడవుల బాధ్యత కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదేనన్నారు. రాష్ట్రంలో అటవీ భూమి ఉన్నా అడవులు ఆ స్థాయిలో లేవని.. పునరుద్ధరణ చేసి పచ్చటి అడవులను సృష్టించాలన్నారు.