తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

byసూర్య | Wed, Aug 21, 2019, 05:41 PM

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, బాలూ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, 2023 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి Fri, Mar 29, 2024, 02:50 PM