byసూర్య | Wed, Aug 21, 2019, 03:32 PM
నియోజకవర్గంలోని వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 20సీసీ టీవీ కెమెరాలను నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరిగినా సీసీ కెమెరాలు బందిస్తాయని, చెడు ఘటనలు, దొంగతనాలు జరగకుండా ఇవి గ్రామాన్ని పదిలపరుస్తాయని, గ్రామానికి మూడో కన్నుగా కెమెరాలు పని చేస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మెంబరు ఆచారి, జడ్పీటీసీ మెంబరు పోతుగంటి భరత్ ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.