byసూర్య | Tue, Aug 20, 2019, 09:00 PM
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.