హైదరాబాద్‌ మెట్రోలో పాము

byసూర్య | Tue, Aug 20, 2019, 02:25 PM

హైదరాబాద్‌ : మెట్రో రైలులో ఓ పాము కనిపించడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 14న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందని ప్రయాణికులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ రైలు ఎల్బీనగర్‌ చేరుకున్న అనంతరం అక్కడే నిలిపివేశారు. అప్పటి నుంచి పాము కోసం ఆ రైలును మెట్రో స్టేషన్‌లోనే ఉంచి తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం స్నేక్‌ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ఈరోజు వెల్లడించారు. ప్రమాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM