byసూర్య | Tue, Aug 20, 2019, 02:25 PM
హైదరాబాద్ : మెట్రో రైలులో ఓ పాము కనిపించడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 14న దిల్సుఖ్నగర్ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందని ప్రయాణికులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ రైలు ఎల్బీనగర్ చేరుకున్న అనంతరం అక్కడే నిలిపివేశారు. అప్పటి నుంచి పాము కోసం ఆ రైలును మెట్రో స్టేషన్లోనే ఉంచి తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం స్నేక్ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ఈరోజు వెల్లడించారు. ప్రమాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.