byసూర్య | Tue, Aug 20, 2019, 01:21 PM
నిర్మల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాసు వెంకట్ గైక్వాడ్(34), నగేశ్ బాలాజీ కారస్కర్(24)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై 29 చోరీ కేసులు ఉన్నాయి. వారి నుంచి రూ.87,500 విలువచేసే బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.