నిధులు కేటాయించి పూర్తి చేయాలి : కోమటిరెడ్డి

byసూర్య | Tue, Aug 20, 2019, 12:06 PM

ఉదయసముద్రం -బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు కేటాయిం చి పూర్తి చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రైతు పాదయాత్రను తలపెట్టారు. నిధుల కొరతతో 12 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ పథకం కోసం ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు 5వేల మంది రైతులతో పాదయాత్ర చేయాలని నిర్ణయించానని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సోమవారం ఆయన డీజీపీకి లేఖ అందజేశారు. బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్‌ జలసౌధ వరకు 100 కిలోమీటర్లుఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పాదయాత్రకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కోమటిరెడ్డి భావిస్తున్నారు. మంగళవారం కల్లా అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.దీనిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ..12 ఏళ్లుగా బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం పెండింగ్‌లో ఉందని, కరువు పీడిత ప్రాంతం కావడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా పాదయాత్ర చేసి తీరతానన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM