రాజీవ్‌కు సోనియాగాంధీ ఘన నివాళి

byసూర్య | Tue, Aug 20, 2019, 09:41 AM

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రముఖులు మంగళవారంనాడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ సతీమణి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు వీర్ భూమిలోని రాజీవ్ స్మారకంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.


 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, గులాం నబీ ఆజాద్, భూపిందర్ సింగ్ హుడా, అహ్మద్ పటేల్ తదితరులు సైతం దివంగత నేతకు నివాళులర్పించారు. ప్రియాంక భర్త రాబర్డ్ వాద్రా, కుమార్తె మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. కాగా, తన తండ్రి రాజీవ్ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాహుల్ సోమవారంనాడు ఓ ట్వీట్‌లో తెలిపారు.


Latest News
 

రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM
మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి శానంపూడి Fri, Apr 19, 2024, 01:27 PM