ఊరంతా ఒక్కటే విగ్రహం.. మిట్టపల్లికి సర్ ప్రైస్ గిఫ్ట్ ఇస్తాన్న హరీష్ రావు

byసూర్య | Mon, Aug 19, 2019, 06:38 PM

ఊరంతటికీ ఒక్కడే వినాయకుడు. అదీ మట్టి విగ్రహం. వినాయకచవితి సందర్భంగా ఊరి ప్రజలందరూ అక్కడే పూజలు. వినడానికే ఎంత బాగుందో కదా. నిజంగా ఇది నిజమే. అందరం కలిసి ఒకే దగ్గర వినాయకుని పూజ చేద్దామంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఇచ్చిన పిలుపునకు మిట్టపల్లి గ్రామం స్పందించింది. యువత, మహిళలు, రైతులు, ప్రజాప్రతినిధులు సహా అన్ని వర్గాలూ ఓకే అన్నాయి. సంఘాలూ సరేనన్నాయి. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.


అంతేకాదు... మిట్టపల్లి స్ఫూర్తిగా మరో ఐదు గ్రామాలు అదే నిర్ణయం తీసుకున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్, మాచపూర్ బండ చెర్లపల్లి, నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామాల ప్రజలు కూడా... ‘పర్యావరణ పరిరక్షణకు మేమూ ముందుకొస్తాం. మా ఊరిలో ఒక్కడే వినాయకుడిని పెట్టుకుంటాం’ అంటూ తీర్మానాలు చేసుకున్నారు. వాటి ప్రతులను హరీష్‌రావు అందించారు. ఇక కొసమెరుపు ఏమిటంటే... మిట్టపల్లి గ్రామానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హరీష్‌రావు ప్రకటించారు.


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM