స్వల్ప అస్వస్థత కు గురైన తెలంగాణ గవర్నర్

byసూర్య | Mon, Aug 19, 2019, 05:38 PM

తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమం నిమిత్తం.. ఆయన సతీమణితో కలిసి బీహార్‌లోని గయ పర్యటనకు వెళ్లారు. సోమవారం అకస్మాత్తుగా వాంతులు కావడంతో.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను సమీపంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ముందు జాగ్రత్తగా రక్తపరీక్ష, ఈసీజీ నిర్వహించారు. ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకున్న తర్వాత గవర్నర్‌ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్‌ చేరుకోనున్నారు.  

Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM