byసూర్య | Mon, Aug 19, 2019, 03:12 PM
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లేడీస్ హాస్టల్ లోకి ఆగంతకుడు చొరబడిన ఘటనను నిరసిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఘటనపై అధికారులు స్పందించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల నినాదాలతో ఓయూ ప్రాంగణం దద్దరిల్లింది.