byసూర్య | Mon, Aug 19, 2019, 03:00 PM
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిని కలిశారు. సూర్యాపేట జిల్లాలో కృష్ణా పరివాహక ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని ఉత్తమ్ కోరారు. వరద ముంపులో నష్టపోయిన రైతాంగానికి పంటనష్ట పరిహారం ఇవ్వాలని ఉత్తమ్ సీఎస్ కు వినతిపత్రం అందజేశారు.