byసూర్య | Mon, Aug 19, 2019, 02:56 PM
బీజేపీ నేత జేపీ నడ్డావి మాయమాటలు అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తాము ఐదేళ్లు చేసిన ఆరోపణలే.. జేపీ నడ్డా చేశారన్నారు. ఐదేళ్లుగా బీజేపీ ఏం చేసిందని, ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్లు దొంగ నాటకాలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని స్క్రాబ్ అంతా బీజేపీలో చేరిందని, ఆ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. నడ్డా పర్యటనతో బీజేపీ నడ్డి విరిగిందన్నారు.