పాలన చేతగాకే బిజెపిపై విమర్శలు : బాబు మోహన్

byసూర్య | Mon, Aug 19, 2019, 12:43 PM

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని బీజేపీ నాయకుడు బాబు మోహన్ అన్నారు. నేడు ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జేపీ నడ్డా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని జేపీ నడ్డా ఆదేశించారన్నారు. బీజేపీలో ఇంక పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్నారు. పరిపాలన చేతకాక టీఆర్ఎస్ నాయకులు బీజేపీని విమర్శిస్తున్నారని బాబు మోహన్ పేర్కొన్నారు.


బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో లేదో... కొంత కాలం ఆగితే టీఆర్ఎస్‌కు తెలుస్తుందన్నారు. కూల్చటం తప్ప కేసీఆర్‌కు ఏమీ తెలియదన్నారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ ఉండదని.. ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్‌లు అవుట్ డేటెడ్ అవుతారా? అని ప్రశ్నించారు. పార్టీ ఏపని ఇచ్చిన కష్టపడి పనిచేస్తానన్నారు. కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఎంపీ ఓటమిలో తన పాత్ర ఉందని బాబు మోహన్ వెల్లడించారు. 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM