byసూర్య | Mon, Aug 19, 2019, 12:41 PM
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. బాగ్ లింగంపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి సభ్యత్వాన్ని ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కళాశాలలో జేపీ నడ్డా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ, రాంచందర్ రావు, మురళీధర్ రావు పాల్గొన్నారు.