byసూర్య | Sun, Aug 18, 2019, 04:39 PM
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ నుంచి లక్డీకాపూల్ వరకు ప్రయాణం చేశారు. దీంతో మిగతా ప్రయాణికులు వారితో ఆసక్తిగా కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కొందరు తీసిన వీడియోలను భద్రతా సిబ్బంది సెల్ఫోన్ నుంచి తొలగించారు.