byసూర్య | Sun, Aug 18, 2019, 03:38 PM
హైదరాబాద్: ఓయూ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో ఇవాళ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పోలీసుల ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. 20ఏళ్లుగా పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ నగరానికి వచ్చాయంటే అందులో పోలీసుల కృషి కూడా ఉందని సీపీ పేర్కొన్నారు.