నాగార్జునసాగర్‌లో పర్యాటకుల రద్దీ

byసూర్య | Sun, Aug 18, 2019, 03:10 PM

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో సాగర్‌ అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో సాగర్‌ పరిసరాలన్నీ పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భారీగా వాహనాల రాకతో వన్‌ వే విధానం ఏర్పాటు చేశారు.


Latest News
 

ఆ భూమి మొత్తం అటవీ శాఖదే Fri, Apr 19, 2024, 10:55 AM
సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM