byసూర్య | Sun, Aug 18, 2019, 01:04 PM
హైదరాబాద్: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో జేపీ నడ్డాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీతో జేపీ నడ్డా బీజేపీ కార్యాలయానికి బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిలు, పదాధికారులతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. సాయంత్రం 4.10 గంటలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు హరితప్లాజాలో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.