byసూర్య | Mon, Jun 24, 2019, 10:05 PM
కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ మాజీ ఎంపీ. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైయ్యారు. మరి కవిత ఇకపై ఏం చేయబోతున్నారు. రాజ్యసభకు వెళతారన్న చర్చ కొన్నాళ్లు పార్టీలో సాగింది. నేషనల్ పాలిటిక్స్ మీద మరింత ఫోకస్ పెట్టబోతున్నారన్న గుసగుసలూ వినిపించాయి. కానీ.. రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అటు పార్టీ హైకమాండ్ ఆలోచన కూడా అలానే ఉందని తెలుస్తోంది. మరి కవిత తెలంగాణ రాజకీయాల్లో ఏం చేయబోతున్నారన్నది వేచిచూడాల్సిందే.