byసూర్య | Mon, Jun 24, 2019, 09:40 PM
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ ఆడపిల్లల జోలికొస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. నిర్మల్,ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలాకాలంగా ముస్లిం యువత ఆదివాసీ యువతుల దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ఇకనైనా తీరు మార్చుకోకపోతే వారి తల తీసేస్తానని హెచ్చరించారు. బాపూరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలంలో ఇటీవల నిర్వహించిన విజయోత్సవ సభలో బాపూరావు ఈ వ్యాఖ్యలు చేశారు.