byసూర్య | Mon, Jun 24, 2019, 02:48 PM
తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారంనాడు విచారణ చేపట్టనున్నది. సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలని 2016లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా సచివాలయాన్ని కూల్చివేయబోమని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఎపికి కేటాయించిన భవనాలు తిరిగి తెలంగాణకు అప్పగించడంతో మొత్తం సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.