byసూర్య | Mon, Jun 24, 2019, 02:14 PM
జనగామలోని యశ్వంతాపూర్ వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రాజయ్యలు పాల్గొన్నారు.