byసూర్య | Mon, Jun 24, 2019, 01:01 PM
అస్వస్థతతో ఉన్న జనగామ ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరిరెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ఉదయంపరామర్శించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివాసానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ఉదయం వెళ్లారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ప్రభుత్వ విప్ బొడికుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు.