byసూర్య | Mon, Jun 24, 2019, 11:49 AM
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సమావేశమయ్యారు. నగరంలో ఆకస్మికంగా కురిసే భారీ వర్షాలపై తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నారు. వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నత చర్చించనున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.