byసూర్య | Mon, Jun 24, 2019, 09:13 AM
బేగంపేట మోతీలాల్ నెహ్రూనగర్లోని భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నేడు వ్యాపార రుణాలపై ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకుడు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఔత్సాహిక వ్యాపారస్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. వివరాలకు 9618453891లో సంప్రదించాలని తెలిపారు.