కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నాగ్ ట్వీట్.. !

byసూర్య | Fri, Jun 21, 2019, 09:11 PM

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇంతకాలానికి వారి కల నెరవేరింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తాజాగా సినీ హీరో నాగార్జున కూడా ఈ ప్రాజెక్టుపై ట్వీట్ చేశారు. 
‘నీరే ప్రపంచానికి జీవం. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించినందుకు శుభాకాంక్షలు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అద్భుత ప్రతిభకి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది కేటీఆర్ కి కాదు... హరీష్ రావుకి అంటూ విమర్శలు చేశారు.
ఇంకొందరు మాత్రం నాగ్ బిగ్ బాస్ చేస్తున్నావంటగా ఈ సంవత్సరం అని ప్రశ్నలు కురిపించారు. ఇంకొందరు మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉందని... అందుకే కేటీఆర్ పై భజన మొదలుపెట్టారంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల భజన చేయడం నాగ్ కి అలవాటు అంటూ.. ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా... ఆ కామెంట్ కి అదే రీతిలో అక్కినేని అభిమానులు సమాధానం చెబుతున్నారు. 


 


Latest News
 

ఈదుల చెరువును సందర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి Fri, Mar 29, 2024, 01:17 PM
నా కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా: మన్నే Fri, Mar 29, 2024, 01:15 PM
నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం Fri, Mar 29, 2024, 01:06 PM
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు Fri, Mar 29, 2024, 01:04 PM
తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM