byసూర్య | Fri, Jun 21, 2019, 03:15 PM
అహ్మదాబాద్: ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషాద సంఘటన గుజరాత్ రాష్ట్రం బనస్కంత జిల్లా లకానీ తాలుకా కుడ గ్రామంలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. రూ.21 లక్షల అప్పు తిరిగి చెల్లించని కారణంగా హత్య చోటుచేసుకున్నట్లుగా సమాచారం. హత్య చేయడానికి గల కారణాన్ని నిందితుడు ఇంటి గోడలపై స్పష్టంగా రాశాడు. తీసుకున్న డబ్బులు రూ. 21 లక్షలు తిరిగి చెల్లించని కారణంగా హత్య చేసినట్లు నిందితుడు గోడలపై తన రాతల ద్వారా తెలియజేశాడు. రక్తపు మడుగుల్లో పడిఉన్న మృతదేహాలను పొరిగింటి వారు చూడంటంతో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య, భర్త, కొడుకు, కూతురు హత్యకు గురయ్యారు. నిందితుడు పదునైన ఆయుధంతో నలుగురి గొంతు కోసి హతమార్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీకి గాలింపు చర్యలు చేపట్టారు.