byసూర్య | Fri, Jun 21, 2019, 02:07 PM
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషకరమైన విషయమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన కాళేశ్వరం సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించుకోలేకపోయామన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రాజెక్టులు ప్రారంభించడం ఆనందమన్నారు. రానున్న రోజుల్లో రెండు పంటలకు నీళ్లు వస్తాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.