byసూర్య | Fri, Jun 21, 2019, 12:17 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇవాళ ఉదయం 11.23 నిమిషాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కు అనుబంధంగా నిర్మించిన బ్రిడ్జి గుండా మహారాష్ట్ర సరిహద్దుల వరకూ అతిథులు వెళ్లారు.