byసూర్య | Fri, Jun 21, 2019, 11:30 AM
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఉదయం 9:40 గంటలకు మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్కు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఇక మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. అక్కడ జలసంకల్ప యాగం, పూజలు కొనసాగుతున్నాయి. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన వేదపండితులు.. అనంతరం పూజలు ప్రారంభించారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.