byసూర్య | Fri, Jun 21, 2019, 11:29 AM
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 5వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో పలువురు ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో యోగ దినోత్సవం కార్యక్రమాల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఔత్సాహికులతో కలిసి హరీశ్ రావు యోగసనాలు వేశారు. అంతకుముందు పుస్తకావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్సేన్ సాగర్ లోని బుద్దుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమంలోమంత్రి శ్రీనివాస్ గౌడ్, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. పరిగిలోని బీసీ గురుకులంలో విద్యార్థినీ విద్యార్థులు యోగసనాలు వేసి..యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు.