byసూర్య | Thu, Jun 20, 2019, 05:12 PM
సీఎం కెసిఆర్, అయన కుమారుడు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే హరీష్ రావును దూరం పెట్టారన్నారు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్. కేసీఆర్లో నియంతృత్వం రోజురోజుకూ పెరుగుతోందని, రాష్ట్ర ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినా కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పులేదన్నారు. హరీష్రావుకు పేరొస్తుందనే కాళేశ్వరం సాధకుడినని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహం పెట్టడం దౌర్భాగ్యమన్నారు.