జీహెచ్‌ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

byసూర్య | Thu, Jun 20, 2019, 03:10 PM

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. బీసీ ఓటర్ల గుర్తింపుపై ఉన్నతాధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ నేడు సమావేశం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి జులై 4 వరకు బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 6న బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తామన్నారు. జులై 7 నుంచి 11వ తేదీ వరకు ఓటర్ల గుర్తింపుపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పారు. జులై 18న వార్డుల వారీగా బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. అనంతరం తుది జాబితాను మున్సిపల్ పరిపాలనశాఖ సంచాలకునికి అందజేయనున్నట్లు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM