ఆటోడ్రైవర్‌తో వివాహిత రాసలీలలు

byసూర్య | Thu, Jun 20, 2019, 11:30 AM

రోజురోజుకీ అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి. భార్యను భర్త మోసం చేయడం లేదంటే భర్తను భార్య మోసం చేయడం ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్నతల్లే పిల్లలను చిత్ర హింసలకు గురి చేసిన ఉదంతాలెన్నో. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో వెలుగు చూసింది. కొత్తగూడెం టూటౌన్ పరిధిలోని గౌతంపూర్ కాలనీలో రూప అనే మహిళ నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పాచి పని చేస్తూ ఇద్దరు ఆడ పిల్లలను పోషించుకునే ఆమెకు గత కొంత కాలంగా బోనగిరి రాజేశ్‌ అలియాస్‌ బప్పి అనే ఆటోడ్రైవర్‌‌తో వివాహేతర సంబంధం ఉంది. తామిద్దరం దొంగ చాటుగా కలవడానికి అడ్డుస్తున్నారనే కారణంతో పిల్లలు శ్రీ ప్రియ (5), హేమ శ్రీ (8)లను చిత్రహింసలకు గురిచేశారు. రూప వదిన బుధవారం తన రూప ఇంటికి వెళ్లగా ఇద్దరు పిల్లలు గాయాలతో కనిపించారు. దీంతో ఏమైందని అడగ్గా రాజేశ్‌తో కలిసి అమ్మ తమను చిత్రహింసలకు గురి చేసిందని అత్తకు చెప్పి వాపోయారు. వారిద్దరూ తమను బెల్టుతో కొట్టారని, కత్తి కాల్చి వాతలు పెట్టారని చెప్పి విలపించారు. తన భార్య ద్వారా జరిగింది తెలుసుకున్న రూప అన్నయ్య చిన్నారులను హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టర్లకు చూపించాడు. తన సోదరి రూప, బప్పిలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకున్న టూ టైన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


 


Latest News
 

రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM