byసూర్య | Thu, Jun 20, 2019, 09:15 AM
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఇందిరా కెనాల్లో పడిపోయింది. వ్యాన్లో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది చిన్నారులు, మహిళలు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన పట్వాఖండా గ్రామం నాగ్రాం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.