మెట్రో ట్రెయిన్ ముందు దూకి ఆత్మహత్య

byసూర్య | Wed, Jun 19, 2019, 04:52 PM

 డిప్రెషన్‌తో బాధపడుతున్న 23 ఏళ్ల యువకుడు మెట్రో ట్రెయిన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జిరిగింది. జగత్‌పూర్‌లో నివశించే నితిన్ అనే యువకుడు గత రెండేళ్లుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ..స్థానిక ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. కాగా మంగళవారం మధ్యహ్నం నితిన్.. ఢిల్లీలోని సివిల్ లైన్స్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆదే సమయంలో హుడా సీటిస్టేషన్‌కు వెళ్లే ట్రెయిన్ ప్లాట్‌ఫామ్ వద్దకు వస్తోంది. ఇదే అదనుగా భావించిన నితిన్ అందరూ చూస్తుండగానే ట్రాక్ మీదకు దూకాడు. దేహం రెండు ముక్కలవడంతో నితిన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సెక్షన్ 174 కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM