byసూర్య | Wed, Jun 19, 2019, 04:26 PM
ఢిల్లీ : జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం పార్లమెంట్లో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో పొల్గొనేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. దేశంలోని అన్ని చట్ట సభలకు (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 2022లో 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది జరిగే మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.