byసూర్య | Wed, Jun 19, 2019, 02:22 PM
కృష్ణానది నీటి వాటాలపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశమైంది. పోతిరెడ్డిపాడు నుంచి తమిళనాడుకు తాగునీటి అవసరాల కోసం కేటాయించిన నీటిని తెలంగాణ ఇవ్వకపోవడంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణానదిలో సరిపడిన నీటి లభ్యత లేనందునే ఇవ్వలేదని తెలంగాణ తెలిపింది. రాబోయే వాటర్ ఇయర్ లో తమిళనాడుకు 4టీఎంసీల నీటిని విడతల వారీగా విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. కృష్ణాబోర్డు నిర్ణయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు స్వాగతించారు.