byసూర్య | Wed, Jun 19, 2019, 02:12 PM
జులై మొదటి వారంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ రోజు ఆయన గవర్నర్ నరసింహన్ను కలిసి వార్షిక నివేదికను అందించారు. అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బాగా పని చేస్తుందని గవర్నర్ అభినందించారన్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ఇస్తామన్నారు. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు దాదాపు 2 నెలల సమయం పడుతుందన్నారు.