byసూర్య | Wed, Jun 19, 2019, 01:56 PM
రాష్ట్రంలో పోలీసు శాఖకు రూ.700 కోట్లతో నూతన వాహనాలు సమకూర్చామని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నూతన పోలీస్స్టేషన్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. సామాన్య ప్రజలు భయంలేకుండా పీఎస్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. స్టేషన్ల నిర్వహణ కోసం నియోజకవర్గ స్థాయికి రూ.70వేలు, మండల స్థాయి పీఎస్లకు రూ.50వేలు ఇస్తున్నామన్నారు.