కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఎర్రబెల్లి

byసూర్య | Wed, Jun 19, 2019, 12:39 PM

తెలంగాణలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ఏ ప్రాజెక్టూ ఇప్పటివరకూ పూర్తికాలేదని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని ప్రశంసించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారనీ, కాలువల తవ్వకంపై స్టేలు తీసుకొచ్చి పనులను ఆలస్యం చేశారని మండిపడ్డారు. అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయవద్దని ఎర్రబెల్లి హితవు పలికారు. ఇలాగే అబద్ధాలు చెబితే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM